Breaking News
హైదరాబాద్‌లో చరిత్ర సృష్టించిన డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థుల గిన్నిస్ వరల్డ్ రికార్డు

గోదావరిఖని, జూలై 19 (అయుష్ 24 న్యూస్):
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన “ది లార్జెస్ట్ కరాటే డిస్‌ప్లే – గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ప్రయత్నం” కార్యక్రమంలో గోదావరిఖనికి చెందిన డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.

కరాటే మాస్టర్ పసునూటి చందర్ ఆధ్వర్యంలో మొత్తం 35 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని, వేలాది మంది కరాటేకాలతో కలిసి ఒకే సమయంలో కాటా విభాగంలో వరుసగా 40 సార్లు కాటా ప్రదర్శన నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా మాస్టర్ పసునూటి చందర్ మాట్లాడుతూ, కరాటే విద్యార్థులు క్రమశిక్షణ, ఏకాగ్రత, సమన్వయంతో అద్భుత ప్రదర్శన ఇచ్చి గోదావరిఖని ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారని తెలిపారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యార్థులు:

పసునూటి అయాన్ష్, టింగు జయ సాయి చరణ్, గడార్ల సహస్ర, దారవేని సాయి రోషన్, కుక్కల కృతిక్, ఎలకపల్లి భార్గవ రామ, పంబాల వశీకర్, పిల్లి స్మితేష్, నూనె సాత్విక్ నందన్, రజినీకాంత్ భవాని, థాటికొండ సాన్వి శ్రీ, థాటికొండ ఆద్య, సందేవేని అక్షిత, గోరు ప్రణీత్, కస్తూరి రోనిత్ కుమార్, చెన్నూరి అశ్విత్ రెడ్డి, కసర్ల నేత్ర, పచునూరి అక్షయ్, గోరు లక్ష్మీ ప్రియ, బొమ్మకంటి స్పందన, మండ లాస్యప్రియ, బొంతుల సాత్విక్, రాగుల రిషిత, మాడ సర్విన్ రెడ్డి, పచునూరి అభిషేక్, కరుపాకల శ్రీ హర్షిణి, బద్రి శ్రీ సిద్ధ్విక్, బద్రి శ్రీనందన్, కుర్రె శైలేందర్, లోకిని సాయి అనన్య, మాడ శ్రీ వికాసిని, అసంపల్లి శ్రీ హర్షిత్, మహ్మద్ జైన్, దీపిక దుర్గ.

ఈ విజయాన్ని పురస్కరించుకుని FSKAI ఇండియా చీఫ్ రచ్చ శ్రీనుబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడా ప్రముఖులు, తల్లిదండ్రులు మరియు పలువురు కరాటే మాస్టర్లు విద్యార్థులను, కోచ్ పసునూటి చందర్ను ప్రత్యేకంగా అభినందించారు.

క్రీడల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో కరాటే కీలక పాత్ర పోషిస్తుందని, ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధన యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

– అయుష్ 24 న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *