Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి కృషి చేయాలి
బ్రేకింగ్ న్యూస్

పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి కృషి చేయాలి

10:26 ఉదయం AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రస్థాయి సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 7 – అయుష్ 24 న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్ మాధం రజనీ కుమార్ యాదవ్ సూచనలతో, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా మార్గదర్శకత్వంలో సోమవారం హైదరాబాద్‌లోని గౌరెల్లి, పెద్ద అంబర్‌పేట్, హయత్‌నగర్ ప్రాంతంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి పెద్దపల్లి జిల్లాకు చెందిన జిల్లా, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ నమోదు, జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.

రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సభ్యత్వ నమోదు

పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సంబంధించి సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి ప్రజలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంతో పాటు, పాదయాత్ర విజయవంతానికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని నాయకులకు సూచించారు.

ప్రజా సమస్యలపై పోరాట ప్రణాళిక

పెద్దపల్లి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం పార్టీ తరఫున పోరాట ప్రణాళిక రూపొందించాలని నాయకులు నిర్ణయించారు. స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైన సందర్భాల్లో ప్రజా ఉద్యమాలు చేపట్టాలని చర్చించారు.

గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం

తెలంగాణ రాజ్యాధికార పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి గ్రామంలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు, మండల, జిల్లా స్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సమావేశంలో సూచించారు.

ఇట్లు:
సోషల్ మీడియా విభాగం
తెలంగాణ రాజ్యాధికార పార్టీ – పెద్దపల్లి జిల్లా

అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 5🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *