Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › వినాయక చవితికి పకడ్బందీ బందోబస్తు
బ్రేకింగ్ న్యూస్

వినాయక చవితికి పకడ్బందీ బందోబస్తు

02:11 తెల్లవారుజాము AM

రౌడీ, హిస్టరీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

మంథని, సెప్టెంబర్ 5, అయుష్ 24 న్యూస్: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మంథని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 14న జరగనున్న వినాయక చవితి వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లకు శనివారం మంథని పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు.

పండుగ సమయంలో గొడవలు, నేరాలకు పాల్పడటం, బలవంతంగా చందాలు వసూలు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గుంపులుగా ఏర్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు.

పోలీస్ స్టేషన్ పరిధిని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ముందుగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ప్రత్యేక బందోబస్తు చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా బీట్ చెకింగ్, నైట్ రౌండ్స్, ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజలు వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని పోలీసులు కోరారు. ఏదైనా సమస్య తలెత్తినా, అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే మంథని పోలీసులను సంప్రదించాలని సూచించారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 125🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *