Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల తేదీలు ఖరారు
బ్రేకింగ్ న్యూస్

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల తేదీలు ఖరారు

04:55 తెల్లవారుజాము AM

ఈ నెల 23న గణేష్ నిమజ్జనం నిర్వహించాలి: బ్రాహ్మణ పురోహితుల సంఘం

దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్:

దేవరకొండ నియోజకవర్గంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన తేదీలను బ్రాహ్మణ పురోహితుల సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసింది.

ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని దేవరకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కుర్మేటి రవిప్రసాద్ శర్మ కోరారు.

శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పురోహితుల సలహాలు, సూచనలు పాటిస్తూ శాంతి, ఐకమత్యంతో పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుతూ ధర్మబద్ధంగా ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 14 నుంచి 22 వరకు నవరాత్రి ఉత్సవాలు

బ్రాహ్మణ పురోహితుల సంఘం తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 14, సోమవారం నుంచి సెప్టెంబర్ 22, మంగళవారం వరకు వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు.

సెప్టెంబర్ 23, బుధవారం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు.

నిమజ్జన సమయంలో సంప్రదాయ కోలాటాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. మండపాల వద్ద భక్తి పాటలు, భజనలు, సంప్రదాయ సాంస్కృతిక నృత్యాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

మండపాల వద్ద సినిమా పాటలు, ఇతర అనుచిత పాటలకు దూరంగా ఉండి, పండుగ పవిత్రతను, మన సంప్రదాయాలను కాపాడే విధంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించుకోవాలని బ్రాహ్మణ సంఘం నాయకులు ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో దేవరకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు సురభి కృష్ణమూర్తి శర్మ, కార్యనిర్వాహక అధ్యక్షులు గారపాటి భాస్కర శర్మ, ప్రధాన కార్యదర్శి గంప శశికుమార్ శర్మ, కోశాధికారి ఉప్పల శ్రీనివాస్ శర్మ, కన్వీనర్ కుర్మేటి వంశీకృష్ణ, ఉపాధ్యక్షులు బహుగానం చంద్రశేఖర్ శర్మ, బుద్ధు సాయి విశ్వనాథ్ శర్మ, సురభి సత్యనారాయణ శర్మ, కుర్మేటి బిక్షపతి శర్మ, సురభి ప్రభాకర్ శర్మ, చింతలపల్లి శ్రీనివాస్ శర్మ, పాల సదాశివ శర్మ, డేరం జయప్రకాష్ శర్మ, ఉప్పల శ్రీకాంత్ శర్మ, ఘంటసాల సుబ్బయ్య శర్మ, గొట్టిముక్కల గణేష్ శర్మ, శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 30🔗 Shares: 3👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *