Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
బ్రేకింగ్ న్యూస్

టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన

11:26 ఉదయం AM

టేకులపల్లి, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య టేకులపల్లి మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు.

మొక్కంపాడులో సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

మొక్కంపాడు గ్రామంలో సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

పాతర్లగడ్డలో పైప్ కల్వర్ట్ ప్రారంభం

ఆర్‌సీ పేట గ్రామపంచాయతీ పరిధిలోని పాతర్లగడ్డ గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన పైప్ కల్వర్ట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఆర్‌సీ పేటలో రూ.35 లక్షల పనులకు శంకుస్థాపన

ఆర్‌సీ పేట గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో చేపట్టనున్న పైప్ కల్వర్ట్, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్, మొక్కంపాడు సర్పంచ్ సురేష్, ఆర్‌సీ పేట సర్పంచ్ వాసం సువర్ణ, ఉప సర్పంచ్ వాసం రాఘవేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. అభివృద్ధే ధ్యేయంగా.. ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన కొనసాగుతోంది.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *