Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేత
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేత

09:09 ఉదయం AM

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్

దేవరకొండ, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీఓ సాగర్ శనివారం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం మన జన్మహక్కు అని, 1947 ఆగస్టు 15 భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజని అన్నారు. విదేశీ పాలన నుంచి దేశానికి విముక్తి లభించిన ఈ రోజును ప్రతి భారతీయుడు గర్వంగా జరుపుకోవాలని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, కిన్నెర హరికృష్ణ, సిరందాసు కృష్ణయ్య, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, జాన్ యాదవ్, దేవేందర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

🇮🇳 జై హింద్ | వందే మాతరం 🇮🇳

AYUSH 24 NEWS

THE VOICE OF TRUTH

#Ayush24News #Devarakonda #IndependenceDay2026 #BaluNaik #TelanganaNews #JaiHind

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *