587 మందికి కంటి పరీక్షలు.. 162 మందికి శస్త్రచికిత్సలు
దేవరకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS:
దేవరకొండ మండలంలోని పడమటిపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గత వారం రోజులుగా శంకర్ నేత్రాలయం, హైదరాబాద్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 587 మందికి కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, 162 మందికి శస్త్రచికిత్సలు చేసినట్లు పడమటిపల్లి సర్పంచ్ పల్లా శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
పల్లా చంద్రారెడ్డి, పల్లా బాలమ్మ, కీర్తిశేషులు పల్లా ఊర్మిళ, పల్లా నర్సిరెడ్డి మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో, ఇందుర్తి బాలకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, గణపతిరెడ్డి అందించిన ఆర్థిక సహకారంతో శిబిరాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు.
శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి అవసరమైన మందులు అందించామని, వైద్యులు సూచించిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని సర్పంచ్ పల్లా శ్రీకాంత్ రెడ్డి సూచించారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి వైద్య శిబిరాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పల్లా శ్రీకాంత్ రెడ్డి, పల్లా కృష్ణారెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పల్లా శ్రీనివాస్ రెడ్డితో పాటు గ్రామస్తులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
AYUSH24 NEWS
నిజమైన సమాచారం • నిష్పక్షపాత వార్తలు



Musini.Anjan





Leave a Reply