రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ | ఆగస్టు 20 — అయుష్ 24 న్యూస్:
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ పట్లోల్ల సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారత రత్న శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంఘటన్ శ్రీజన్ అభియాన్ PCC పరిశీలకులు, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా AICC పరిశీలకులు శ్రీ దీపక్ రాధౌర్తో పాటు సంగారెడ్డి జిల్లా సంఘటన్ శ్రీజన్ అభియాన్ PCC పరిశీలకులు శ్రీ MD రియాజ్ కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ప్రగతి, యువతకు అవకాశాల కల్పన, సాంకేతిక రంగ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ తీసుకున్న చర్యలు భారతదేశ అభివృద్ధికి బలమైన పునాది వేశాయని నాయకులు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply