ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు
ప్రభుత్వ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వంటా వార్పు’ నిరసన కార్యక్రమాల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని డా. ఏఎస్ రావు నగర్, వంపుగూడ, మల్లాపూర్ (అశోక్ నగర్), నాచారం (హెచ్ఎంటీ నగర్), రామంతాపూర్ ప్రాంతాల్లో నిర్వహించిన వంటా వార్పు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని పేర్కొన్నారు.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.










Leave a Reply