అయుష్ 24 న్యూస్ / మంథని
మంథని, సెప్టెంబర్ 10: మంథని మండలం గుంజపడుగు గ్రామంలో గురువారం ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ దండెవేన సంధ్యా బానేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల నుంచి వెలువడే నీరు బయటకు వెళ్లకుండా ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీజ రెడ్డి, ఎంపీవో షబ్బీర్ అలీ, ఏపీవో, ఫీల్డ్ అసిస్టెంట్ రమాదేవి, పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply