మహానేత సేవలను స్మరించుకున్న కాంగ్రెస్ నాయకులు
టేకులపల్లి, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
టేకులపల్లి మండలం బోడు ఎక్స్రోడ్డులో దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన ఆశయాలను, ప్రజా సంక్షేమ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్, మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాదర్ బాబు, ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ఈది గణేష్, ఇస్లావత్ రెడ్యానాయక్, పోశాలు, లక్ష్మయ్య, ముచ్చా సుధాకర్, సర్పంచ్ కోరం హనుమంతు, ధర్మయ్య, సంజయ్, బొడ్డు అశోక్, నవీన్, సర్దార్, రాందాస్, నాగేశ్వరరావు, ధరావత్ హరి, నరసయ్య, సురేష్, ధర్మ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్కు ఘన నివాళులు అర్పించారు.










Leave a Reply