Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలి
బ్రేకింగ్ న్యూస్

వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలి

12:31 మధ్యాహ్నం PM

104 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్

సంగారెడ్డి, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో 104 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. 104 ఉద్యోగుల సమస్యలను శాసనసభలో ప్రస్తావించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

గత 18 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సేవలందిస్తున్న సుమారు 300 మంది 104 ఉద్యోగులను తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు.

డీపీఎంటీ పరిధిలో పారామెడిక్స్, ల్యాబ్ టెక్నీషియన్లుగా సేవలందిస్తున్న వారిని నిబంధనల ప్రకారం జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసినప్పటికీ, నేటికీ ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఉద్యోగ భద్రత, కనీస వేతనాల కోసం వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డిని మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నుస్రత్, సంతోష్, ప్రసాద్, శివరాజ్, కల్పన, మధుకర్, ఎం.డి. నిజాముద్దీన్, ఎం.డి. అలీ, కిరణ్ కుమార్ తదితరులు కలిశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 154🔗 Shares: 2👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
22 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *