- కృతజ్ఞతలు తెలిపిన నూతన ప్రధాన కార్యదర్శి
దేవరకొండ, ఆగస్టు 19 — అయుష్ 24 న్యూస్:దేవరకొండకు చెందిన చిత్రం ఉదయ్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నల్లగొండ జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. తనపై నమ్మకం, విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి చిత్రం ఉదయ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా చిత్రం ఉదయ్ మాట్లాడుతూ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాంతి కిరణ్, జిల్లా అధ్యక్షులు శ్రీ నాగం వర్షిత్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకురి నరసింహ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ, రాష్ట్ర నాయకులు కేతావత్ లాలు నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ జల్దా భాస్కర్, కౌన్సిల్ మెంబర్ గుండాల అంజయ్య, పట్టణ అధ్యక్షులు వస్కుల సుధాకర్తో పాటు తనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా భావిస్తూ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి శక్తివంచన లేకుండా పనిచేస్తానని చిత్రం ఉదయ్ అన్నారు. ఎస్సీ మోర్చాను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలో తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.










Leave a Reply