రేపటి నుంచి ట్రయల్ రన్.. కొత్తగట్టు టోల్ ప్లాజా వద్ద టోల్ వసూళ్లకు ఏర్పాట్లు
కరీంనగర్–వరంగల్: కరీంనగర్–వరంగల్ మధ్య నిర్మాణం పూర్తయిన గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి NH-563 ట్రయల్ రన్కు సిద్ధమైనట్లు సమాచారం. రహదారిపై వాహనాల రాకపోకలను పరిశీలించేందుకు రేపటి నుంచి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
కొత్త గ్రీన్ఫీల్డ్ రహదారి అందుబాటులోకి వస్తే కరీంనగర్–వరంగల్ మధ్య ప్రయాణ దూరం ప్రస్తుతం ఉన్న సుమారు 72 కిలోమీటర్ల నుంచి 68 కిలోమీటర్లకు తగ్గే అవకాశం ఉంది. దీంతో ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గి, ట్రాఫిక్ పరిస్థితులను బట్టి కారులో సుమారు 45 నిమిషాల నుంచి గంటలోపు ప్రయాణించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రతి కిలోమీటర్కు సీసీ కెమెరాలు
హైవేపై భద్రత, ట్రాఫిక్ పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి కిలోమీటర్కు రెండు సోలార్ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కొత్తగట్టు టోల్ ప్లాజా నుంచి రహదారిపై పరిస్థితులను 24 గంటల పాటు రియల్టైమ్లో పర్యవేక్షించే విధంగా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
అక్టోబర్ 1 నుంచి టోల్ వసూళ్లు?
ట్రయల్ రన్ అనంతరం అక్టోబర్ 1 నుంచి కొత్తగట్టు టోల్ ప్లాజా వద్ద వాహనాల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే టోల్ రేట్లు, వసూళ్ల ప్రారంభ తేదీ తదితర అంశాలపై సంబంధిత అధికారుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కొత్త రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కరీంనగర్–వరంగల్ మధ్య ప్రయాణించే వాహనదారులకు సమయం ఆదా కావడంతో పాటు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
అయుష్ 24 న్యూస్










Leave a Reply