టేకులపల్లి, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: టేకులపల్లి మండలంలోని కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలను ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచి, మెనూ గురించి విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు అందుతున్న వసతులు, విద్యాబోధన, పాఠశాల పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థులతో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే ప్రధాన పునాది అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

ఎమ్మెల్యే ఆకస్మికంగా పాఠశాలను సందర్శించి విద్యార్థుల పరిస్థితులు, వారికి అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించడంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.










Leave a Reply