Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు
బ్రేకింగ్ న్యూస్

కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు

04:43 తెల్లవారుజాము AM

సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ గట్టి హెచ్చరిక

పెద్దపల్లి, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్:

సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.

రామగుండం 11 ఇంక్లైన్, ఆర్‌జీ-1 పరిధిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడి మోకాలికి గాయం కాగా ఆరు కుట్లు పడిన ఘటనను ఎంపీ ప్రస్తావించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పిందని, అయితే ఇటువంటి ఘటనలను చిన్నవిగా పరిగణించి వదిలేస్తే భవిష్యత్తులో ప్రాణనష్టానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

“ఈరోజు ఆ కార్మికుడు ఆరు కుట్లతో బయటపడ్డాడు.. రేపు అదే పరిస్థితి ప్రాణాపాయంగా మారకూడదు. కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు” అని ఎంపీ స్పష్టం చేశారు.

కూలిపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాలు, ప్రాణాపాయ పరిస్థితులు ఉండే అండర్‌గ్రౌండ్ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం ఉత్పత్తి పెంపు కోసం కాకుండా కార్మికుల ప్రాణాలను రక్షించేందుకు ప్రాధాన్యంగా వినియోగించాలని కోరారు.

ఇటీవల బెల్లంపల్లిలో జరిగిన ప్రమాదాన్ని కూడా ప్రస్తావించిన ఎంపీ.. వరుస ప్రమాదాల నివారణకు సింగరేణి యాజమాన్యం భద్రతా వ్యవస్థపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఉత్తర తెలంగాణకు మెరుగైన రైలు కనెక్టివిటీ కల్పించాలి

రైల్వే బోర్డుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్

ఉత్తర తెలంగాణ ప్రజలకు హైదరాబాద్, సికింద్రాబాద్‌తో మెరుగైన రైలు కనెక్టివిటీ కల్పించాల్సిన అవసరం ఉందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.

సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్/హైదరాబాద్ మధ్య అదనపు రైళ్లను నడపాలని తాను పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్‌ను కలిసి ఉత్తర తెలంగాణ ప్రజల రైలు ప్రయాణ అవసరాలను వివరించినట్లు చెప్పారు.

ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి రైల్వేకు భారీగా ఫ్రైట్ ఆదాయం వస్తున్నప్పటికీ, అదే స్థాయిలో ప్రయాణికుల రైలు సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం సరికాదని ఎంపీ అన్నారు.

“రైల్వేకు ఆదాయం అందించే ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ ఎందుకు ఉండకూడదు? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో, ప్రజల అవసరం ఎక్కడ ఉందో రైల్వే బోర్డు నీడ్ బేసిస్‌పై అధ్యయనం చేయాలి” అని డిమాండ్ చేశారు.

ఇటీవల నిర్వహించిన టెస్ట్ రన్, పండుగల సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లను స్వాగతించిన ఎంపీ.. సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‌కు రైలు కనెక్టివిటీని శాశ్వతంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను కోరారు.

రూ.50 లక్షలు సిద్ధం.. సింగరేణి స్థలం ఇవ్వాలి

అంబేద్కర్ భవనానికి వెంటనే భూమి కేటాయించాలి: ఎంపీ వంశీకృష్ణ

అంబేద్కర్ భవన నిర్మాణం కోసం తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి సుమారు రూ.50 లక్షలు ఇప్పటికే కేటాయించినట్లు ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.

ఈ అంశంపై కలెక్టర్ స్థాయి నుంచి సైతం సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినప్పటికీ స్థల కేటాయింపులో జాప్యం జరుగుతోందని అన్నారు.

“నిధులు నేను ఇప్పటికే కేటాయించాను. కలెక్టర్ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇక సింగరేణి యాజమాన్యం ఆలస్యం చేయకుండా వెంటనే స్థలం కేటాయించి అంబేద్కర్ భవన నిర్మాణానికి మార్గం సుగమం చేయాలి” అని ఎంపీ స్పష్టం చేశారు.

కార్మికుల భద్రత విషయంలో రాజీ లేకుండా చర్యలు తీసుకోవడం, ఉత్తర తెలంగాణకు మెరుగైన రైలు కనెక్టివిటీ కల్పించడం, అంబేద్కర్ భవనానికి తక్షణమే స్థలం కేటాయించడం వంటి అంశాలపై సంబంధిత అధికారులు స్పందించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *