Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు చేసేది ఏఐటీయూసీ
బ్రేకింగ్ న్యూస్

కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు చేసేది ఏఐటీయూసీ

08:31 ఉదయం AM

అయుష్ 24 న్యూస్ | కరీంనగర్

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం సమరశీల పోరాటాలు చేసేది ఏఐటీయూసీ అని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు అన్నారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనున్న ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కరీంనగర్‌లో జరిగే రాష్ట్ర 4వ మహాసభల్లో సమగ్రంగా చర్చించి, కార్మికులంతా ఐక్యమై పోరాటాలు నిర్వహించాలని ఆయన అన్నారు. కార్మికుల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందని పేర్కొన్నారు.

స్వాతంత్ర్యానికి పూర్వమే భారతదేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన సంఘం ఏఐటీయూసీ అని నూనె వెంకటేశ్వర్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు అందించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికుల పట్ల ప్రభుత్వాలు చూపుతున్న సవతి తల్లి ప్రేమను వీడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర 4వ మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నూనె వెంకటేశ్వర్లు కోరారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగిళ్ల సహదేవ్, ఏనుక సత్తయ్య, డి. ఆంజనేయులు, ఏ. వెంకటేష్, కొప్పుల నాగేష్, కరంటు నార్య, గోరటి ఇద్దయ్య, ఎం. వెంకటయ్య, నూనె దేవయ్య, గోరటి సైదులు, కే. రమేష్, ఎం. శ్రీను, ఏనుక అంజయ్య, పి. జంప్ల మస్తాన్, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 11🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *