స్పీడ్ పంచింగ్, స్పీడ్ కికింగ్లో అద్భుత ప్రదర్శన.. వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్లో డబుల్ గోల్డ్
హైదరాబాద్, ఆగస్టు 24 | అయుష్ 24 న్యూస్
కేవలం ఐదేళ్ల వయస్సులోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ నాగర్కర్నూల్ జిల్లా అచంపేటకు చెందిన చిన్నారి స్మరణి రాజ్ అంతర్జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్–2026 సందర్భంగా స్పీడ్ పంచింగ్, స్పీడ్ కికింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది.

రికార్డు కార్యక్రమంలో స్మరణి రాజ్ కేవలం ఒక నిమిషంలో 200 స్పీడ్ పంచ్లు, ఒక నిమిషంలో 100 స్పీడ్ కిక్లు విజయవంతంగా పూర్తి చేసింది. చిన్న వయస్సులోనే అసాధారణ వేగం, క్రమశిక్షణ, శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శించినందుకు ఆమెకు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా హై రేంజ్ వరల్డ్ రికార్డ్స్ తెలంగాణ హెడ్ సుమన్, అమికల్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్ & డైరెక్టర్ వీణా వాహిని, జేఆర్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి, 1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ తెలంగాణ, దక్షిణ భారత ఆర్గనైజింగ్ మేనేజర్ రాజు రాథోడ్ చిన్నారి స్మరణి రాజ్ను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
తైక్వాండో ఛాంపియన్షిప్లో డబుల్ గోల్డ్
ఆగస్టు 22, 23 తేదీల్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్లోనూ స్మరణి రాజ్ తన ప్రతిభను చాటింది. 5 సంవత్సరాల కేటగిరీ కయోరుగు పీవీ విభాగం, స్పీడ్ కికింగ్ విభాగాల్లో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్ సాధించి డబుల్ గోల్డ్ విజేతగా నిలిచింది.

ఈ అంతర్జాతీయ తైక్వాండో, రికార్డు కార్యక్రమంలో జాంబియా, ఇథియోపియా, మారిషస్, జపాన్, శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలతో కలిపి మొత్తం 12 దేశాల నుంచి, భారతదేశంలోని 22 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయి పోటీలో కేవలం ఐదేళ్ల వయస్సులోనే ఒక చిన్నారి ప్రపంచ రికార్డు సాధించడంతో పాటు డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషమని నిర్వాహకులు పేర్కొన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా అచంపేటలోని వివేకానంద స్కూల్లో నర్సరీ చదువుతున్న స్మరణి రాజ్ చిన్న వయస్సులోనే ప్రపంచస్థాయి ఘనత సాధించడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఆమె తల్లి సబావత్ వర్ష, తండ్రి రాథ్లావత్ రాజు తమ కుమార్తె సాధించిన అరుదైన విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అమికల్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్ & డైరెక్టర్ వీణా వాహిని, జేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఫౌండర్ గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి, తెలంగాణ మరియు దక్షిణ భారత ఆర్గనైజింగ్ మేనేజర్ రాజు రాథోడ్ మాట్లాడుతూ.. స్మరణి రాజ్లోని ప్రతిభను చిన్న వయస్సులోనే గుర్తించి సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉందన్నారు.
కేవలం ఐదేళ్ల వయస్సులో ప్రపంచ రికార్డు, స్పీడ్ పంచింగ్, స్పీడ్ కికింగ్లో అద్భుత ప్రదర్శనతో పాటు 1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించడం ద్వారా స్మరణి రాజ్ అచంపేట, నాగర్కర్నూల్ జిల్లా, తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది.
ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి స్మరణి రాజ్కు అయుష్ 24 న్యూస్ తరఫున హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో మరెన్నో జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించి భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఆకాంక్షిస్తున్నాం.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply