పోలీసుల చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధం: జనసేన పార్టీ నాయకులు
దేవరకొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం సీనియర్ నాయకుడు కొర్ర చందు నాయక్ను హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని జనసేన పార్టీ దేవరకొండ నాయకులు తీవ్రంగా ఖండించారు. శాసనసభ సమావేశాల సమయంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకుడిని నిర్బంధించడం సరికాదని జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొర్ర సింధు నాయక్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే చందు నాయక్ను ఇంటి వద్ద నిర్బంధించారని ఆరోపించారు. ఒక గిరిజన నాయకుడిని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకుడిని నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

అరెస్టులు, నిర్బంధాలతో తమ పోరాటాన్ని అడ్డుకోలేరని, ప్రజా సమస్యలపై జనసేన పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. పోలీసుల చర్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై కూడా జనసేన నాయకులు విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు.
ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకే రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని జనసేన నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు.
జనసేన పార్టీ ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూ, వారి హక్కుల కోసం పోరాడుతుందని నాయకులు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని అన్నారు.
కొర్ర చందు నాయక్ హౌస్ అరెస్ట్కు సంబంధించిన పోలీసుల వైఖరిపై జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.










Leave a Reply