జాతీయ జెండాను ఆవిష్కరించిన సంఘం అధ్యక్షులు శిరమోని రాములు
దేవరకొండ, ఆగస్టు 15: దేవరకొండ పట్టణంలోని జై శ్రీరామ్ తాపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు శిరమోని రాములు జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే బాలు నాయక్ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరాయి పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య సమరంలో ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు.

స్వాతంత్ర్య భారతదేశంలో కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని తెలిపారు. ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. కార్మిక భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని, కార్మికులంతా ఐక్యంగా ముందుకు వచ్చి భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. భవన నిర్మాణం పూర్తయిన అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరవుతానని హామీ ఇచ్చారు.
అనంతరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమానికి హాజరైన కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు, కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారి, సంఘం సభ్యులు, తాపీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
🇮🇳 జై హింద్ | వందే మాతరం 🇮🇳
AYUSH 24 NEWS
THE VOICE OF TRUTH
#Ayush24News #Devarakonda #IndependenceDay2026 #BaluNaik #JaiSriramTapiWorkers #TelanganaNews #JaiHind










Leave a Reply