తెల్ల రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కొండమల్లేపల్లి మండల పరిధిలోని వర్ధమానగూడెం గ్రామపంచాయతీలో తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ వేణుధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రణీత మంతు నాయక్, ఉప సర్పంచ్ వెంకటమ్మ, ఫకీర్పురం ఉప సర్పంచ్ బోడా, ఫకీర్పురం మాజీ ఉప సర్పంచ్ జగదీష్, వార్డు సభ్యులు రాములు, లక్ష్మి, గ్రామ పెద్దలు కటి వెంకన్న, డీలర్ విజయ్, శ్రీను, కిషన్, మోహన్, గణేష్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. అభివృద్ధి దిశగా అడుగులు!
ప్రజలకు సంక్షేమం – ప్రతి కుటుంబానికి భరోసా



Mahamood Mohammed






Leave a Reply