రక్తదానం చేసి సందేశం ఇచ్చిన జనసేన నాయకుడు నల్లగోపుల వెంకట చలపతిరావు
కలిదిండి, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

జనసేన సేవా సైన్యం ఆధ్వర్యంలో, హోప్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరాన్ని కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర కార్మికుల సంక్షేమ బోర్డు డైరెక్టర్ నల్లగోపుల వెంకట చలపతిరావు సందర్శించారు.
ఈ సందర్భంగా నల్లగోపుల వెంకట చలపతిరావు స్వయంగా రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయంలో మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన సూచించారు.

పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు మొటేపల్లి హనుమాన్, స్థానిక కూటమి నాయకులు, జనసైనికులు, యువత, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










Leave a Reply