కొత్త కమిటీలతో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పిలుపు
పెద్దపల్లి, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్కుమార్ గౌడ్ అనుమతితో పెద్దపల్లి జిల్లా పరిధిలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పేర్లను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గురువారం ప్రకటించారు.
జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతన మండల అధ్యక్షులను నియమించినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నూతన మండల అధ్యక్షులు కీలకంగా పనిచేయాలని రాజ్ ఠాకూర్ ఆకాంక్షించారు.
ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
మంథని నియోజకవర్గం
- మంథని: శ్రీ ఐలి ప్రసాద్
- ముత్తారం: శ్రీ దొడ్డ బాలాజీ
- రామగిరి: శ్రీ తులసి రామ్ గౌడ్
- కమాన్పూర్: శ్రీ సయ్యద్ అన్వర్
పెద్దపల్లి నియోజకవర్గం
- పెద్దపల్లి: శ్రీ కట్కూరి సుదాకర్రెడ్డి
- ఓదెల: శ్రీ మూల ప్రేమ్సాగర్రెడ్డి
- కాల్వ శ్రీరాంపూర్: శ్రీ గజవేన సదయ్య
- సుల్తానాబాద్: శ్రీ చిలుక సతీష్
- ఎలిగేడు: శ్రీ సామ రాజేశ్వర్రెడ్డి
- జూలపల్లి: శ్రీ బొజ్జ శ్రీనివాస్
- సుల్తానాబాద్ టౌన్: శ్రీ వి. అబ్బయ్య గౌడ్
- పెద్దపల్లి టౌన్: శ్రీ భూతగడ్డ సంపత్
రామగుండం నియోజకవర్గం
- అంతర్గాం: శ్రీ సింగం కిరణ్
- పాలకుర్తి: శ్రీ ముక్కెర శ్రీనివాస్
ధర్మపురి నియోజకవర్గం
- ధర్మారం: శ్రీ లౌడియా రూప్ల నాయక్
నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్









Leave a Reply