Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › ప్రజల ఆరోగ్యమే లక్ష్యం.. ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకురావడమే కాంగ్రెస్ ప్రజా పాలన ధ్యేయం
బ్రేకింగ్ న్యూస్

ప్రజల ఆరోగ్యమే లక్ష్యం.. ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకురావడమే కాంగ్రెస్ ప్రజా పాలన ధ్యేయం

దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం 5 నుంచి 10 పడకలకు విస్తరణ – సదరం క్యాంపు, అంబులెన్స్ సేవల ప్రారంభం త్వరలో దేవరకొండలోనే వాహన రిజిస్ట్రేషన్ సేవలు.. కొత్త మండలాలకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల సముదాయాలు – దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ దేవరకొండ, సెప్టెంబర్ 1:

09:17 ఉదయం AM

దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం 5 నుంచి 10 పడకలకు విస్తరణ – సదరం క్యాంపు, అంబులెన్స్ సేవల ప్రారంభం
త్వరలో దేవరకొండలోనే వాహన రిజిస్ట్రేషన్ సేవలు.. కొత్త మండలాలకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల సముదాయాలు
– దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ, సెప్టెంబర్ 1: ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, దేవరకొండ నియోజకవర్గంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు, ప్రభుత్వ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా పలు కీలక కార్యక్రమాలు చేపడుతున్నామని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు తెలిపారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు ప్రభుత్వ సేవలను ప్రతి ఒక్కరికీ మరింత చేరువ చేయడమే కాంగ్రెస్ ప్రజా పాలన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
డయాలసిస్ కేంద్రం 5 నుంచి 10 పడకలకు విస్తరణ
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో 5 పడకల సామర్థ్యంతో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని 10 పడకలకు విస్తరించి, అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించేలా అభివృద్ధి చేశారు.
జిల్లా కలెక్టర్ శ్రీ బి. చంద్రశేఖర్ గారు, DMHO, RDO, వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు విస్తరించిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దేవరకొండలోనే మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను పెంచడంతో పాటు పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
దివ్యాంగులకు సదరం సేవలు ఇక దేవరకొండలోనే
దివ్యాంగులు పింఛన్‌తో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు అవసరమైన సదరం సర్టిఫికెట్ కోసం గతంలో నల్లగొండ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదని ఎమ్మెల్యే తెలిపారు. దీనివల్ల దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని పేర్కొన్నారు.
ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, దివ్యాంగులకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వారానికి రెండు రోజుల పాటు సదరం క్యాంపులు నిర్వహించే విధంగా ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించింది.
జిల్లా కలెక్టర్, వైద్యాధికారులతో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ గారు ఈ సేవలను ప్రారంభించారు.
“దివ్యాంగులు సర్టిఫికెట్ కోసం నల్లగొండకు వెళ్లాల్సిన పరిస్థితి ఇక ఉండకూడదు. ప్రయాణ ఖర్చులు, సమయం, శారీరక ఇబ్బందులు తగ్గించి ప్రభుత్వ సేవలను వారికి మరింత చేరువ చేయాలన్నదే మా ఉద్దేశం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సేవలు ప్రారంభం
అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో RTA ఆధ్వర్యంలో అంబులెన్స్ సేవలను ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ బి. చంద్రశేఖర్ గారు, RDO, వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో కలిసి అంబులెన్స్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా ఎంతో విలువైనదని, రోగులను సకాలంలో ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
రోగుల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా ఉండాలని, దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దేవరకొండలో వైద్య సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధితో తనకు ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే బాలు నాయక్ గారు గుర్తుచేశారు.
2009లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి కృషి చేశానని తెలిపారు. అనంతరం ప్రభుత్వ స్థాయిలో జరిగిన ప్రయత్నాలతో ఆసుపత్రి విస్తరణకు మార్గం సుగమమైందన్నారు.
“గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దేవరకొండ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రి విస్తరణకు కృషి చేశాను. ఇప్పుడు మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని మరింత బలోపేతం చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు” అని ఎమ్మెల్యే బాలు నాయక్ గారు స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువ కావాలి
దేవరకొండ నియోజకవర్గంలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
గతంలో RDO కార్యాలయం మిర్యాలగూడలో ఉండగా, దేవరకొండకు RDO కార్యాలయం తీసుకురావడానికి తాను చేసిన కృషి ఫలించిందని ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన మండలాల్లో ప్రజలు వివిధ ప్రభుత్వ శాఖల పనుల కోసం వేర్వేరు ప్రాంతాలకు తిరగాల్సిన అవసరం లేకుండా, ఒకే చోట అన్ని శాఖల సేవలు అందే విధంగా ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయాల సముదాయాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
త్వరలో దేవరకొండలోనే వాహన రిజిస్ట్రేషన్ సేవలు
ప్రస్తుతం దేవరకొండ నియోజకవర్గ ప్రజలు వాహనాల రిజిస్ట్రేషన్, రవాణా శాఖకు సంబంధించిన ఇతర పనుల కోసం మిర్యాలగూడకు వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
దీనివల్ల ప్రజలకు సమయం, డబ్బు వృథా అవుతోందని పేర్కొన్నారు.
“దేవరకొండ ప్రజలు వాహన రిజిస్ట్రేషన్ కోసం మిర్యాలగూడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దేవరకొండలోనే ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేశాం. త్వరలోనే దేవరకొండలో సంబంధిత కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తాం” అని ఎమ్మెల్యే బాలు నాయక్ గారు తెలిపారు.
దేవరకొండ సమగ్ర అభివృద్ధే లక్ష్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో దేవరకొండ నియోజకవర్గానికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
“ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నాం. వైద్యం, విద్య, సాగునీరు, రహదారులు, తాగునీరు, ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ పథకాలు.. ఇలా ప్రతి రంగంలో దేవరకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. నా హయాంలో సాధ్యమైనంత ఎక్కువ అభివృద్ధి పనులు పూర్తి చేసి దేవరకొండను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాను” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉండేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ శ్రీ బి. చంద్రశేఖర్ గారు, DMHO, దేవరకొండ RDO, పట్టణ మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్లు ఆలంపల్లి నర్సింహా, వడ్త్య దేవేందర్, హన్మంత్ వెంకటేష్ గౌడ్, దేవరకొండ మండల అధ్యక్షుడు మరుపాకుల సురేష్ గౌడ్, కౌన్సిలర్లు, వివిధ మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, RTI నాయకులు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
✦ AYUSH 24 NEWS CHANNEL ✦
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 5🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
42 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *