సెప్టెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి: నల్లగొండ మున్సిపల్ కమిషనర్
నల్లగొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): బీసీ మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. కృష్ణ వంశీ తెలిపారు.
నల్లగొండ పట్టణ పరిధిలోని అర్హత కలిగిన బీసీ మహిళలు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. TSOBMMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
అర్హతలు ఇవే..
- ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు.
- దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అనంతరం దరఖాస్తు ప్రతిని అవసరమైన పత్రాలతో కలిసి నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్ సూచించారు.
అర్హత కలిగిన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.



Musini.Anjan





Leave a Reply