Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › భక్తిశ్రద్ధలతో అంకాలమ్మ–కాటమయ్య జాతర.. ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బాలు నాయక్
బ్రేకింగ్ న్యూస్

భక్తిశ్రద్ధలతో అంకాలమ్మ–కాటమయ్య జాతర.. ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బాలు నాయక్

చందంపేట మండలం చీత్రియాల గ్రామంలో అంకాలమ్మ–కాటమయ్య జాతర భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది. జాతర సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గ్రామానికి చేరుకుని కాటమయ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కాటమయ్య స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రత్యేక

09:45 ఉదయం AM

చందంపేట మండలం చీత్రియాల గ్రామంలో అంకాలమ్మ–కాటమయ్య జాతర భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది. జాతర సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గ్రామానికి చేరుకుని కాటమయ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా కాటమయ్య స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలోని రహదారి వెంట ఏర్పాటు చేసిన విద్యుత్ వీధి దీపాలను ప్రారంభించారు. గ్రామంలో రాత్రివేళ ప్రజలు, భక్తులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు వీధి దీపాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్న ఎమ్మెల్యే
అనంతరం శ్రీ అంకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రత్యేక పూజలు, మొక్కులు నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.
“అమ్మవారి ఆశీస్సులతో దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి. రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలి. ప్రతి కుటుంబంలో ఆనందం, సౌభాగ్యం నిండాలి. నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని అంకాలమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను” అని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు.
ఎమ్మెల్యే గ్రామానికి చేరుకున్న సందర్భంగా గ్రామస్తులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. జాతర ప్రాంగణం భక్తుల సందడితో కళకళలాడగా, ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే భక్తులతో కలిసి జాతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చీత్రియాలలో ఐదు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
జాతర కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే బాలు నాయక్ చీత్రియాల గ్రామంలో ఐదు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ, దశలవారీగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.
“పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ఒక కుటుంబానికి సొంత ఇల్లు రావడం అంటే ఆ కుటుంబానికి భరోసా, భద్రత, గౌరవం లభించినట్టే. అందుకే అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది” అని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు వారికి శాశ్వత నివాస భద్రత కలుగుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
చీత్రియాల గ్రామంలో ఐదు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం జరగడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సొంతింటి కల నెరవేరుతున్నందుకు ఎమ్మెల్యే బాలు నాయక్‌కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఒకవైపు అంకాలమ్మ–కాటమయ్య జాతరలో భక్తి పారవశ్యం.. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాల్లో సొంతింటి ఆనందం వెల్లివిరిసిన ప్రత్యేక రోజుగా చీత్రియాల గ్రామం నిలిచింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, చందంపేట మాజీ ఎంపీపీ ఏడుపుల గోవింద్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, స్థానిక మాజీ సర్పంచ్ కాకునూరి రంగయ్య గౌడ్, జిల్లా కార్యదర్శి జర్పుల భధ్యా నాయక్, దేవరకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, మాజీ ప్రజాప్రతినిధులు, ఉమ్మడి చందంపేట మండల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
– ఆయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 35🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
42 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *