స్వాతంత్ర్య దినోత్సవం రోజున దారుణ ఘటన.. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న మహిళ
అనకాపల్లి | అయుష్ 24 న్యూస్
అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చోడవరం మండలం రామ్మోహన్పేటలో వెంకటరావు (58) అనే వ్యక్తిని అతని భార్య ఇందిర (50) గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే హత్యకు అసలు కారణాలు తెలియాల్సి ఉంది.
నిందితురాలిగా పేర్కొంటున్న ఇందిర స్థానికంగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
హత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply