అయుష్ 24 న్యూస్
మండల యువత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సేవాలాల్ సేన మండల యువత అధ్యక్షులు తేజావత్ ప్రేమ్ కుమార్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ స్థాయి నాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి యువతకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
మండలంలోని యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభివృద్ధి, సామాజిక అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిపారు. యువత ఐక్యతతో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
“యువత బలం – సమాజ బలం” అనే నినాదంతో యువత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తేజావత్ ప్రేమ్ కుమార్ నాయక్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేనకు చెందిన నాయకులు, యువత పాల్గొన్నారు.










Leave a Reply