Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం
బ్రేకింగ్ న్యూస్

మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం

02:50 తెల్లవారుజాము AM

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా గంగాపురి 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం

మంథని, ఆగస్టు 24 | అయుష్ 24 న్యూస్

మంథని నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరో కీలక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంథని పట్టణంలోని గంగాపురిలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి శ్రీధర్ బాబు సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

నూతన సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గడంతో పాటు వోల్టేజీ సమస్యలకు పరిష్కారం లభించనుందని మంత్రి పేర్కొన్నారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

మంథని అభివృద్ధిలో మరో ముందడుగు

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో మంథని ప్రాంతంలో విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నూతన సబ్‌స్టేషన్ ద్వారా మంథని పట్టణం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆపరేషన్ పర్యవేక్షక ఇంజనీర్ వి. గంగాధర్, మంథని ఆపరేషన్ డీఈ వి. ప్రభాకర్, పెద్దపల్లి యూజీసీబీ & కన్స్ట్రక్షన్ డీఈ కె. శ్రీనివాస్ రెడ్డి, కన్స్ట్రక్షన్ ఏడీఈ యం. సత్యనారాయణ, మంథని కన్స్ట్రక్షన్ ఏఈఈ బి. రాజ్, కరీంనగర్ సివిల్ ఈఈ కె. శ్రీనివాస్, పెద్దపల్లి సివిల్ ఏడీఈ ఎ. జయ భారతి, ఆపరేషన్ ఏడీఈ వి. వెంకటనారాయణ, ఆపరేషన్ ఏఈ కె. సాయి తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *