24 గంటల విద్యుత్ సరఫరా హామీ అమలు చేయాలని డిమాండ్
విద్యుత్ డీఈకి వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు, రైతులు
మంథని, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్:
బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ‘రైతు గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ నాయకులు, రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించారు.
అనంతరం బీజేపీ నాయకులు, రైతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, చల్లా నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
హామీ మేరకు 24 గంటల కరెంటు ఇవ్వాలి: సునీల్ రెడ్డి
ఈ సందర్భంగా చంద్రుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్నప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం తక్కువ సమయం విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందుల కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనూ రైతులు సాగునీటి కోసం ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
అనంతరం బీజేపీ నాయకులు, రైతులు మంథని విద్యుత్ శాఖ డీఈని కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్యప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము, నియోజకవర్గ కో-కన్వీనర్ నంపెళ్లి రమేష్, మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్, సబ్బాని సంతోష్, కొయ్యడ సతీష్, పగే రంజిత్, కొండ్రు లక్ష్మణ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఎల్కా సదానందం, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, మట్ట శంకర్, దుర్గం తిరుపతి, మల్లారపు అరుణ్, చిలువేరు సతీష్, మల్లారెడ్డి, కోడారి దేవేందర్, ఎలావెన సమ్మయ్య, సేనవేన సునీల్, పత్తి మహేందర్ రెడ్డి, విశ్వాతేజ, సామల అశోక్, ఎడ్ల సాగర్, భానుప్రకాశ్, తొట్ల రాజు, శంకర్, కసిపేట సాంబయ్య, మణుగు కొమురయ్య, విష్ణు, ప్రకాష్, గురువేష్, హేమంత్, సాయి, స్వరూప, రాజశేఖర్, ఆనంద్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల









Leave a Reply