సంస్థాగత బలోపేతం, హిందూ ధర్మ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చ
మంథని, ఆగస్టు 24, అయుష్ 24 న్యూస్: విశ్వ హిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశం మంథనిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కరీంనగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతం, హిందూ ధర్మ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలపై కార్యవర్గ సభ్యులతో చర్చించారు.
జిల్లాలోని అన్ని మండలాలు, ప్రఖండాలు, గ్రామ స్థాయిలో సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో ధార్మిక, సామాజిక చైతన్యాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా కార్యదర్శి నాగులమల్యాల సత్యం, సహకార్యదర్శి అడిగొప్పుల రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రఖండ అధ్యక్షులు రావుల సతీష్, ఉపాధ్యక్షులు బోట్ల ఆంజనేయులు, మాదాడి నరేందర్ రెడ్డి, సత్సంగ్ ప్రముఖ్ కొమురవెల్లి హరిష్ గుప్తా, సహ కార్యదర్శులు గుండా శ్రీనివాస్, కజ్జం శ్యామ్, మందిర్ మఠ్ ప్రముఖ్ రాజమౌళి గౌడ్, గోరక్ష ప్రముఖ్ నూక శ్రీనివాస్, ప్రచార ప్రముఖ్ తూర్పటి రాము పాల్గొన్నారు.
అలాగే సభ్యులు గాజుల సురేష్, మండల శివ, బండారి ప్రసాద్, కొమురవెల్లి తిరుపతి, సిల్వేరి రవీందర్, నిమ్మతి శ్రీనివాస్, వడ్లకొండ శ్రావణ్, మాచిడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
మాతృశక్తి మంథని సంయోజక రావికంటి రేణుక, సహ సంయోజక కొత్త పుష్పలత, తోట సునీత, రాచర్ల తిరుమల, కుక్కడపు రాధా, దుర్గావాహిని జిల్లా సంయోజక తిరుమల, అలాగే భజరంగదళ్ అన్ని ప్రఖండాల కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply