Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › మాటలు నమ్మరని.. కాగితాలతో దగా చేసిన దుద్దిళ్ల: పుట్ట మధూకర్‌
బ్రేకింగ్ న్యూస్

మాటలు నమ్మరని.. కాగితాలతో దగా చేసిన దుద్దిళ్ల: పుట్ట మధూకర్‌

03:48 మధ్యాహ్నం PM

హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శ

రైతుల సమస్యలపై ముత్తారంలో బీఆర్‌ఎస్‌ భారీ నిరసన.. ఎడ్లబండ్ల ర్యాలీ

ముత్తారం, సెప్టెంబర్‌ 3 | అయుష్ 24 న్యూస్

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ విమర్శించారు. మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరని, కాగితాలపై హామీలు రాసి ప్రజలను దగా చేశారని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై ఆయన ఆరోపణలు చేశారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు ముత్తారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ 1,000 రోజుల పాలనలో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రైతులతో కలిసి ఎడ్లబండ్ల ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పుట్ట మధూకర్‌ మాట్లాడారు.

అధికారం కోసం అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని ఆయన ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మేనిఫెస్టోలో అనేక అంశాలను పొందుపరిచి, వాటిలో ఒక్క పథకాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు లేదని పుట్ట మధూకర్‌ అన్నారు. రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు, రుణమాఫీ, ఇందిరమ్మ భరోసా వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు బోనస్‌, పంటలకు మద్దతు ధర వంటి అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతు సంక్షేమంపై ప్రశ్నలు

కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల రైతులకు రెట్టింపు పరిహారం, కరకట్టల నిర్మాణం వంటి హామీలు ఇచ్చారని, వాటిలో ఎన్ని అమలు చేశారో చెప్పాలని పుట్ట మధూకర్‌ డిమాండ్‌ చేశారు. భూభారతి, 22ఏ నిబంధనల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌, ఎరువుల సరఫరా వంటి కార్యక్రమాలను అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు చైతన్యవంతులై ప్రభుత్వ పనితీరును ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని, రాబోయే కాలం బీఆర్‌ఎస్‌ పార్టీదేనని పుట్ట మధూకర్‌ అన్నారు. ప్రజల పక్షాన పోరాడే పార్టీగా బీఆర్‌ఎస్‌ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.

అనంతరం ముత్తారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని పుట్ట మధూకర్‌ ప్రారంభించారు.

— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 15🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *