కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వం చాటుతున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు
టేకులపల్లి: టేకులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన కుటుంబాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
పెట్రాంచెలక గ్రామానికి చెందిన ఈసం ముచ్చ రాజు ఇటీవల మృతిచెందగా, ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.

అదేవిధంగా కొప్పురాయి గ్రామంలో గోగ్గల హనుమంతు కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు దశదిన కర్మకు అవసరమైన బియ్యాన్ని కూడా అందజేశారు.
కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ కోరం సురేందర్ మానవత్వాన్ని చాటుకుంటున్నారని స్థానికులు పేర్కొన్నారు. మొత్తం రూ.10,000 ఆర్థిక సహాయం అందించి రెండు కుటుంబాలకు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు చింత కళ్యాణ్, ఈసం రాజేశ్వరి, మార్కెట్ డైరెక్టర్ జార సమ్మక్క, యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ భూక్యా వెంకటేష్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్దార్, రవీందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆయుష్ 24 న్యూస్ | THE VOICE OF TRUTH
#Ayush24News #Tekulapalli #KoramSurender #Congress #TelanganaNews #Humanity #FinancialHelp










Leave a Reply