మెదక్, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఎండోమెంట్ సెల్ నియామక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్ సూర్య ప్రకాష్, కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మెదక్ జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలు, డివిజన్లు, వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, సభ్యులను ఎండోమెంట్ సెల్లో నూతనంగా నియమించారు. కొత్తగా నియమితులైన సభ్యులు తమ పరిధిలోని దేవాలయాల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.

అలాగే ఆలయాల అభివృద్ధి, దేవాదాయ ఆస్తుల పరిరక్షణ, భక్తుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధితో పాటు సనాతన ధర్మం, హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ఆలయ సంస్కృతిని పరిరక్షించేందుకు ఎండోమెంట్ సెల్ మరింత విస్తృతంగా పనిచేస్తుందని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, రాష్ట్ర ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్ కవిత రెడ్డి, మెదక్ కంటెస్టెంట్ పంజా విజయ్, మెదక్ జిల్లా ఎండోమెంట్ సెల్ కో-కన్వీనర్లు ప్రసాద్, నవీన్, జాయింట్ కన్వీనర్లు నరేంద్ర, నవీన్, కృష్ణ, రాజేశ్వరి తదితరులు పాల్గొని నూతనంగా నియమితులైన సభ్యులకు అభినందనలు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply