ఘనంగా నివాళులర్పించిన రెడ్డి సంఘం నాయకులు
మంథని, అయుష్ 24 న్యూస్: రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 157వ జయంతి సందర్భంగా మంథని రెడ్డి భవన్ ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి రెడ్డి సంఘం నాయకులు, సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి అందించిన సేవలను స్మరించుకున్నారు. విద్య, సామాజిక అభివృద్ధి, సమాజ సేవలో ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు మందల సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి ఏలకోరి సత్యనారాయణ రెడ్డి, సహాయ కార్యదర్శి ముసిపట్ల రమణారెడ్డి, ఆర్థిక కార్యదర్శి మూల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే కార్యవర్గ సభ్యులు లెక్కల కిషన్ రెడ్డి, లంబు ప్రభాకర్ రెడ్డి, మారం సత్యనారాయణ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రెడ్డి సంఘం పెద్దలు బయ్యపు మురళీధర్ రెడ్డి, బెల్లంకొండ ప్రకాశ్ రెడ్డి, లంబు సుధాకర్ రెడ్డి, బెల్లంకొండ భూమి రెడ్డి, చింతల సుధాకర్ రెడ్డి, విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.










Leave a Reply