ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అయ్యూబ్ అలీ క్షేత్రస్థాయిలో పరిశీలన
పరకాల | హనుమకొండ జిల్లా | అయుష్ 24 న్యూస్
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు పర్యటించనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పరకాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా స్థలి, సభా వేదికతో పాటు సీఎం పాల్గొనే వివిధ కార్యక్రమాల ప్రదేశాలను హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షులు అయ్యూబ్ అలీ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా సభా ఏర్పాట్లను పరిశీలించిన వారు సంబంధిత అధికారులు, పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.
సీఎం పర్యటనను, భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అయ్యూబ్ అలీ పిలుపునిచ్చారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply