సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కామ్రేడ్ పల్లా నర్సింహారెడ్డి
దేవరకొండ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండలోని పల్లా పర్వత్ రెడ్డి భవన్ సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పల్లా నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం సమర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తుం బుచ్చిరెడ్డి, మండల కార్యదర్శి దేప సుదర్శన్ రెడ్డి, సహాయ కార్యదర్శి నూనె రామస్వామి, పట్టణ కార్యదర్శి వలమల్ల ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లా రంగారెడ్డి, AIYF జిల్లా అధ్యక్షులు అనమల నవీన్, మండల కార్యవర్గ సభ్యులు జూలూరి వెంకట్రాములు, కిన్నెర యాదయ్య, ఎండి మైనొద్దీన్, AISF డివిజన్ కార్యదర్శి వట్టేపు శివకుమార్, పట్టణ సహాయ కార్యదర్శులు తోటపల్లి నగేష్, జూలూరి జ్యోతిబస్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే పట్టణ ఏరియా శాఖ కార్యదర్శులు, నాయకులు పగిల్లా బుచ్చయ్య, లింగంపల్లి వెంకటయ్య, అలామోని మల్లయ్య, కందుకూరి శ్రీను, రాజమల్లయ్య, ఏషామోని మల్లేష్, ఎండి జాకీర్, మన్సుర్, కాటం గోవర్ధన్, దాసరి రమేష్, పల్లె మధు, కనుగుల యాదయ్య, ముడిగా మల్లయ్య, పంగ యాదయ్య, అనిల్ రెడ్డి, మునగాల సుభాష్, విరయ్య, రామకృష్ణ, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.
🇮🇳 స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం
🇮🇳 జై హింద్ | వందే మాతరం 🇮🇳
AYUSH 24 NEWS
THE VOICE OF TRUTH
#Ayush24News #80thIndependenceDay #IndependenceDay2026 #Devarakonda #CPI #Indian










Leave a Reply