పెండింగ్ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 07:
సెప్టెంబర్ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ ర్యాలీకి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) పూర్తి మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన చేపడుతున్నట్లు INTUC నేతలు తెలిపారు.
INTUC అధ్యక్షుడు డా. జి. సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాన డిమాండ్లు:
- 2వ వేతన సవరణ సంఘం (PRC) సిఫార్సులను వెంటనే అమలు చేయాలి.
- పెండింగ్లో ఉన్న ఆరు DA వాయిదాలను విడుదల చేయాలి.
- CPSను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి.
- ఉద్యోగుల పెండింగ్ సంక్షేమ బిల్లులను పరిష్కరించాలి.
- పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలి.
- 104 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల ఉద్యోగ సమస్యలు, 8 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 10న జరిగే నిరసనలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, పెన్షనర్లు, అనుబంధ కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని డా. సంజీవ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి INTUC ఉపాధ్యక్షుడు జి. సత్యజిత్ రెడ్డి, ఆదిల్ షరీఫ్, విజయ్ కుమార్ యాదవ్, కాసిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు.
అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, హైదరాబాద్










Leave a Reply