మాతా అమృతానందమయి దేవిని కలిసి ఆశీస్సులు పొందిన మంత్రి
అమృతపురి (కొల్లం), సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని ప్రసిద్ధ అమృతపురి ఆశ్రమాన్ని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు.
అమృతపురి ఆశ్రమానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలోని కాళీ దేవాలయాన్ని, కలరిని ఆయన సందర్శించారు.
అనంతరం శ్రీ మాతా అమృతానందమయి దేవితో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాతా అమృతానందమయి దేవి ఆశీస్సులు పొందారు.
తదుపరి అమృత విశ్వవిద్యాపీఠం క్యాంపస్ను, అమృత ఆయుర్వేద కళాశాలను మంత్రి సందర్శించి అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు. దాదాపు మూడు గంటల పాటు మంత్రి లోకేష్ అమృతపురి ఆశ్రమంలో గడిపారు.









Leave a Reply