దేవినేనిగూడలో కొత్త విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటు
దేవినేనిగూడ, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్:
దేవినేనిగూడ గ్రామపంచాయతీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా కొత్తగా విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటు చేపట్టారు.
బీజాపూర్ హైవే రోడ్డు నుంచి దేవినేనిగూడ గ్రామం వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాలను అమర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో రాత్రివేళ గ్రామానికి రాకపోకలు సాగించే ప్రజలకు వెలుతురు అందడంతో పాటు భద్రత, సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది.
ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి యు. నిర్మలా నారాయణ, ఉపసర్పంచ్ యు. భాస్కర్, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టినట్లు తెలిపారు.
గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని గ్రామ నాయకులు పేర్కొన్నారు.
“ప్రజా సంక్షేమమే లక్ష్యం.. గ్రామ అభివృద్ధే ధ్యేయం” అనే ఉద్దేశంతో దేవినేనిగూడ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటు పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
— అయుష్ 24 న్యూస్









Leave a Reply