దేవరకొండ, ఆగస్టు 22, అయుష్ 24 న్యూస్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా వైస్ చైర్మన్గా నల్లవెల్లి వెంకటయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సత్యనారాయణ, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, నల్లగొండ జిల్లా చైర్మన్ బోడ స్వామి తెలిపారు.ఈ సందర్భంగా నల్లవెల్లి వెంకటయ్య మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఇంతటి ముఖ్యమైన బాధ్యతను అప్పగించడం ఎంతో గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అంకితభావంతో పనిచేస్తానన్నారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో పాటు భారత రాజ్యాంగం అందించిన సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలకు కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. ఎస్సీ వర్గాల హక్కులు, సంక్షేమం, అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.జిల్లా వ్యాప్తంగా ఎస్సీ డిపార్ట్మెంట్ను మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడం, ఎస్సీ వర్గాల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం, వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున నిబద్ధతతో పనిచేయడం తన ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి, తనకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ నల్లవెల్లి వెంకటయ్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.పార్టీ బలోపేతం కోసం, ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక న్యాయం కోసం మరింత బాధ్యతతో, నిబద్ధతతో పనిచేస్తానని ఆయన అన్నారు.










Leave a Reply