80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీఓ సాగర్ శనివారం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం మన జన్మహక్కు అని, 1947 ఆగస్టు 15 భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజని అన్నారు. విదేశీ పాలన నుంచి దేశానికి విముక్తి లభించిన ఈ రోజును ప్రతి భారతీయుడు గర్వంగా జరుపుకోవాలని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, కిన్నెర హరికృష్ణ, సిరందాసు కృష్ణయ్య, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, జాన్ యాదవ్, దేవేందర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
🇮🇳 జై హింద్ | వందే మాతరం 🇮🇳
AYUSH 24 NEWS
THE VOICE OF TRUTH
#Ayush24News #Devarakonda #IndependenceDay2026 #BaluNaik #TelanganaNews #JaiHind










Leave a Reply