80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
దేవరకొండ, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండాను మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి ఎగురవేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి ఆత్మబలిదానాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని, ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ రవీందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంఎస్ సిరాజ్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, దేవరకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారపాకుల సురేష్ గౌడ్, కిన్నెర హరికృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మాజీ ఎంపీపీ జాన్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వి. దేవేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు.
🇮🇳 జై హింద్ | వందే మాతరం 🇮🇳
AYUSH 24 NEWS
THE VOICE OF TRUTH
#Ayush24News #Devarakonda #IndependenceDay2026 #BaluNaik #MarketCommittee #TelanganaNews #JaiHind










Leave a Reply