104 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్
సంగారెడ్డి, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో 104 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. 104 ఉద్యోగుల సమస్యలను శాసనసభలో ప్రస్తావించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
గత 18 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సేవలందిస్తున్న సుమారు 300 మంది 104 ఉద్యోగులను తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు.
డీపీఎంటీ పరిధిలో పారామెడిక్స్, ల్యాబ్ టెక్నీషియన్లుగా సేవలందిస్తున్న వారిని నిబంధనల ప్రకారం జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసినప్పటికీ, నేటికీ ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఉద్యోగ భద్రత, కనీస వేతనాల కోసం వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డిని మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నుస్రత్, సంతోష్, ప్రసాద్, శివరాజ్, కల్పన, మధుకర్, ఎం.డి. నిజాముద్దీన్, ఎం.డి. అలీ, కిరణ్ కుమార్ తదితరులు కలిశారు.









Leave a Reply