కౌన్సిలర్ ఎస్.కే. నవీద్
దేవరకొండ, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: దేవరకొండ పట్టణంలోని 11వ వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని 11వ వార్డు కౌన్సిలర్ ఎస్.కే. నవీద్ తెలిపారు.
వార్డులో జరుగుతున్న సీసీ రోడ్డు మరమ్మతు పనులను కౌన్సిలర్ స్వయంగా పర్యటించి పరిశీలించారు. పనుల నాణ్యతను పరిశీలిస్తూ, పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎస్.కే. నవీద్ మాట్లాడుతూ.. “ప్రతి ఇంటి ముందూ మంచి రోడ్డు ఉండాలి.. ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలి” అనేదే తన సంకల్పమని తెలిపారు.

వార్డులోని ప్రతి ఇంటికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు వీధి దీపాలు, సీసీ రోడ్లు, పారిశుధ్యం, చెత్త సమస్య, తాగునీటి సౌకర్యం వంటి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ప్రజలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. వార్డులో ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
“ప్రజల సేవే నా బాధ్యత.. వార్డు అభివృద్ధే నా ధ్యేయం” అని కౌన్సిలర్ ఎస్.కే. నవీద్ పేర్కొన్నారు.
ఎస్.కే. నవీద్
11వ వార్డు కౌన్సిలర్
కాంగ్రెస్ పార్టీ | దేవరకొండ










Leave a Reply