Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › Devarakonda › దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసియా స్వర్ణ పతక విజేత నారీమల్ల ప్రవళికకు ఘన సన్మానం
Devarakonda

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసియా స్వర్ణ పతక విజేత నారీమల్ల ప్రవళికకు ఘన సన్మానం

03:51 మధ్యాహ్నం PM

దేవరకొండ, జూలై 27 (AYUSH24 NEWS): దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన ప్రముఖ అథ్లెట్ నారీమల్ల ప్రవళికకు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.వి.టి (NVT) సభ్యులతో కలిసి ప్రవళిక సాధించిన స్వర్ణ పతకాన్ని ఆమె మెడలో ధరింపజేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ, సాధారణ కుటుంబం నుంచి పట్టుదల, కృషి, అంకితభావంతో భారతదేశానికి స్వర్ణ పతకం అందించిన ప్రవళిక నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు. క్రీడల్లోనే కాకుండా చదువులోనూ ప్రతిభ కనబరిచి అగ్రస్థానంలో నిలవడం ఆమె ప్రత్యేకత అని పేర్కొన్నారు.

ప్రవళిక తల్లిదండ్రులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ తమ కుమార్తెను ప్రోత్సహించి దేశానికి గర్వకారణంగా నిలిపారని ప్రశంసించారు. అలాగే ఆమె విజయానికి కృషి చేసిన కోచ్ పరశురామ్ సేవలను ప్రత్యేకంగా అభినందించారు.

స్టేడియాల అవసరంపై విజ్ఞప్తి

దేవరకొండ నియోజకవర్గంలో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎంతోమంది ఉన్నప్పటికీ, సరైన క్రీడా మౌలిక వసతులు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాలు అందుబాటులోకి వస్తే మరెందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి భారతదేశానికి పతకాలు సాధిస్తారని అన్నారు.

క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తే యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండటంతో పాటు ప్రవళికలాంటి మరెందరో క్రీడాకారులు తయారవుతారని అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులు, అధికారులు క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్టేడియాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గత 12 సంవత్సరాలుగా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ స్టేడియం సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, రాపోలు నిరంజన్, వై.ఎస్. కరుణాకర్, శైలేష్, వల్లమల్ల ఆంజనేయులు, సన్నీ, కౌన్సిలర్లు పొట్ట మురళి, సాయి చంద్ర గౌడ్, కరాటే మాస్టర్ గోపి, రాజు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ జాంగీర్ మరియు విద్యార్థులు, వివేకానంద వొకేషనల్ కాలేజ్కు చెందిన రోజా, లావణ్య, అంజలి, విద్యార్థులు, అలాగే శివ, సందీప్, శివకుమార్, వినయ్, యశ్వంత్, ఉదయ్, శ్రీను, సురేందర్, హనుమంత్, క్రీడాకారులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

— AYUSH24 NEWS
“The Voice of Truth”

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *