దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ నిర్వహణ
అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన క్రీడాకారులు, సభ్యులు
దేవరకొండ, జూలై 26 (AYUSH 24 NEWS):
దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.వి.టి. (NVT) మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్పై భారత సైన్యం చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన 527 మంది వీర జవాన్లను ఈ సందర్భంగా స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు.
పాకిస్థాన్ సైనికులు లద్దాఖ్లోని కార్గిల్ పర్వత శిఖరాలను ఆక్రమించగా, వారిని తరిమికొట్టేందుకు భారత సైన్యం చేపట్టిన సాహసోపేతమైన సైనిక చర్యలో మంచుతో కప్పబడిన క్లిష్టమైన కొండల్లో సుమారు రెండు నెలల పాటు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి విజయాన్ని సాధించారని తెలిపారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను యువత ఆదర్శంగా తీసుకొని దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, పి.జె. శాంసన్, భాస్కర్ రెడ్డి, వల్లమళ్ల ఆంజనేయులు, తాళ్ల సురేష్, జగదీశ్వరాచారి, సైదులు, నాగు, సంజీవ, రాజు, కుమార్, అంజి, వాసుదేవుడు, నాగార్జున, అభిరామ్, చరణ్, వంశీ తదితరులు, క్రీడాకారులు మరియు కళాకారులు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.
— AYUSH 24 NEWS | The Voice of Truth


