Breaking News
దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ నిర్వహణ

అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన క్రీడాకారులు, సభ్యులు

దేవరకొండ, జూలై 26 (AYUSH 24 NEWS):
దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.వి.టి. (NVT) మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత సైన్యం చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన 527 మంది వీర జవాన్లను ఈ సందర్భంగా స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు.

పాకిస్థాన్ సైనికులు లద్దాఖ్‌లోని కార్గిల్ పర్వత శిఖరాలను ఆక్రమించగా, వారిని తరిమికొట్టేందుకు భారత సైన్యం చేపట్టిన సాహసోపేతమైన సైనిక చర్యలో మంచుతో కప్పబడిన క్లిష్టమైన కొండల్లో సుమారు రెండు నెలల పాటు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి విజయాన్ని సాధించారని తెలిపారు.

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను యువత ఆదర్శంగా తీసుకొని దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, పి.జె. శాంసన్, భాస్కర్ రెడ్డి, వల్లమళ్ల ఆంజనేయులు, తాళ్ల సురేష్, జగదీశ్వరాచారి, సైదులు, నాగు, సంజీవ, రాజు, కుమార్, అంజి, వాసుదేవుడు, నాగార్జున, అభిరామ్, చరణ్, వంశీ తదితరులు, క్రీడాకారులు మరియు కళాకారులు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.

— AYUSH 24 NEWS | The Voice of Truth

100 మంది కరాటే విద్యార్థులకు గోంగూర ఆకుకూరల పంపిణీ – కరాటేతో క్రమశిక్షణ, ఆరోగ్యం, ఆత్మరక్షణ సాధ్యం: ప్రముఖుల పిలుపు

మిర్యాలగూడ, జూలై 26 (AYUSH 24 NEWS):
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక హౌసింగ్ బోర్డ్‌లో సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే కరాటే శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కరాటే సాధనలో ప్రతిభ కనబరిచిన 100 మంది విద్యార్థులకు గోంగూర ఆకుకూరలను బహుమతిగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి జననేత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ మునీర్, సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా చీఫ్ మాస్టర్ బూడిద సైదులు, 5వ వార్డు కౌన్సిలర్ లావూరి అరుణ సుధాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ మునీర్ మాట్లాడుతూ, సమాజంలో మహిళలపై జరుగుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటిలోని ఆడ, మగ పిల్లలు తప్పనిసరిగా కరాటే శిక్షణ పొందాలని సూచించారు. కరాటే ద్వారా ఆత్మరక్షణతో పాటు ధైర్యం, క్రమశిక్షణ పెంపొందుతాయని అన్నారు.

చీఫ్ మాస్టర్ బూడిద సైదులు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా మిర్యాలగూడలో కరాటేకు పునాది వేసి వేలాది మంది విద్యార్థులకు శిక్షణ అందించానని తెలిపారు. తన శిష్యులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా తన శిష్యుడు మాస్టర్ రామకృష్ణ నాయక్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

5వ వార్డు కౌన్సిలర్ లావూరి అరుణ సుధాకర్ మాట్లాడుతూ, తమ వార్డులోని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు కరాటే శిక్షణ అందించాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరాటేను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా మాస్టర్ రామకృష్ణ నాయక్ సేవలను కొనియాడారు.

మాస్టర్ బాండావత్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ, చిన్ననాటి నుంచి కరాటేనే తన జీవిత లక్ష్యంగా ఎంచుకుని వందలాది అవార్డులు సాధించానని తెలిపారు. మిర్యాలగూడలో అత్యాధునిక డోజో ఏర్పాటు చేసి ప్రతి ఆదివారం విద్యార్థులకు పండ్లు, కూరగాయలు పంపిణీ చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియాలో చేర్పించి ఆత్మరక్షణ విద్యను నేర్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రవళిక, అజయ్, కిషోర్, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.

పల్లవి మోడల్ స్కూల్‌లో ఇంటర్ స్కూల్ కరాటే పోటీలు ఘనంగా నిర్వహణ

హైదరాబాద్, జూలై 26 (అయుష్ 24 న్యూస్): హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉన్న పల్లవి మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ గండ్రల్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ కరాటే ఛాంపియన్‌షిప్ ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో హైదరాబాద్ నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ పోటీలను కాటా మరియు కుమిటే విభాగాల్లో నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. పోటీలకు కరాటే ఆర్. మల్లికార్జున్ గౌడ్ ప్రధాన న్యాయనిర్ణేతగా వ్యవహరించగా, పలువురు రిఫరీలు, జడ్జీలు సమర్థవంతంగా పోటీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ గండ్రల్ మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని తెలిపారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు చదువులోనూ రాణించడంతో పాటు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారని అన్నారు. ముఖ్యంగా కరాటే క్రమశిక్షణ, ఆత్మరక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఉత్తమ యుద్ధకళ అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుసాన్ జాన్, పాఠశాల కరాటే కోచ్ డబ్ల్యూ. ఆనంద్, నగరంలోని వివిధ పాఠశాలల కరాటే కోచ్‌లు, రిఫరీలు, జడ్జీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్
“నిజం కోసం… ప్రజల గొంతుక”