గుగులోత్ శ్రీకాంత్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఇల్లందు ఎమ్మెల్యే గౌ. శ్రీ కోరం కనకయ్య గారు
టేకులపల్లి మండలం: కోయగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమతండా గ్రామానికి చెందిన గుగులోత్ శ్రీకాంత్ గారు ఇటీవల స్వర్గస్తులైన సందర్భంగా, నేడు నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ కోరం కనకయ్య గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఓదార్పు పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ కోరం సురేందర్–ఉమా గారు, టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ లక్కినేని శ్యామ్ గారు, కోయగూడెం సర్పంచ్ శ్రీ కోరం సుభాష్ చంద్రబోస్ గారు, పెగల్లపాడు సర్పంచ్ శ్రీ కోరం హనుమంతు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
– AYUSH 24 NEWS
“The Voice of Truth”

