Breaking News
కూతురిని కాపాడబోయి మృతి చెందిన పర్శవేని రాజు కుటుంబానికి సునీల్ రెడ్డి పరామర్శ

కుటుంబానికి అన్నలాగా అండగా ఉంటానని భరోసా

ఆయుష్ 24 న్యూస్ | ప్రత్యేక కథనం

నీటి ప్రమాదంలో కూతురిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన పర్శవేని రాజు కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పరామర్శించారు.

రాజు మృతితో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అన్నలాగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.

కుటుంబానికి ఎలాంటి సహాయం అవసరమైనా తన వంతు సహకారం అందిస్తానని సునీల్ రెడ్డి తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, వారి బాధను పంచుకున్నారు.

ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ, కుటుంబం ఈ కష్టకాలం నుంచి ధైర్యంగా బయటపడాలని, వారికి అండగా తాను ఎల్లప్పుడూ ఉంటానని పేర్కొన్నారు.

AYUSH 24 NEWS
The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *