దేవరకొండ చేనేత సహకార సంఘంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
చేనేత కార్మికులకు ఘన సన్మానం – కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు
దువ్వ వెంకటేశ్వర్ల కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం ప్రకటించిన పద్మశాలి కులబాంధవులు
దేవరకొండ | AYUSH24 NEWS
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి చేనేత సహకార సంఘం చైర్మన్ చేరిపల్లి బాలరాజు అధ్యక్షత వహించగా, దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చేనేత రంగం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తోందన్నారు. నేటి పరిస్థితుల్లో చేనేత వృత్తికి సాంకేతికతను జోడించి యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు చేనేత వృత్తిని చేరువ చేయాలని, ప్రతి సభ్యుడు చేనేత సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు రాయితీ రుణాలు, ప్రోత్సాహక పథకాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
ఈ సందర్భంగా పట్టణానికి చెందిన నలుగురు చేనేత కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఇటీవల అనారోగ్యంతో ఇంటికే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దువ్వ వెంకటేశ్వర్ల కుటుంబానికి పట్టణ పద్మశాలి కులబాంధవులు, మహిళలు కలిసి రూ.25 వేల ఆర్థిక సహాయం సేకరించి త్వరలో పూర్తి మొత్తాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పున్న వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం డైరెక్టర్లు గుర్రం విజయలక్ష్మి, రాపోలు భారతమ్మ, వనం శ్రీనివాసులు, చిలువేరు స్వామి నందీశ్వర్, పగిడిమర్రి శ్రీనివాసులు, ముసిని అంజన్, కౌన్సిలర్లు పులిజాల భవాని జానీ, గాజుల సావిత్రి మురళి, చిలువేరు చంద్రమౌళి, సిరిపోతు శ్రీరాములు, మసన మణిదీప్, గాజుల జనార్ధన్, వనం పుష్పలత, పగిడిమర్రి సత్యమూర్తి, ఇడం చంద్రమౌళి, పున్న భిక్షమయ్య, చేరిపల్లి జయలక్ష్మి, సంగిశెట్టి జ్యోత్స్నా తదితరులు పాల్గొన్నారు.
— AYUSH24 NEWS


